
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):–
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సమయంలో విద్యార్థుల మనసులో టెన్షన్ పెరిగిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా 996971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం మూల్యాంకనంలో కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వేరిఫై చెయ్యనున్నట్లు దీనిపై అధికారులు ఎలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.. తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 21 నాడు ఇంటర్ ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.. ప్రతిసారి ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తరువాతే, రీ వాల్యుయేషన్కు అవకాశం ఉంటుంది కాబట్టి, దీని కోసం ప్రతి సబ్జెక్టుకు 600 రూపాయలు వసూలు చేయబడతాయని సమాచారం.. విద్యార్థులు తమ ఫలితాలను https://tgbie.cgg.gov.in లింక్ ద్వారా తెలుసుకోవచ్చని, వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను పొందడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది.