
క్రైమ్ మిర్రర్, పరకాల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో భాగంగా పరకాల పట్టణంలోని ఫెర్టిలైజర్ మరియు విత్తనాల దుకాణాలపై శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ఏసీపీ సతీష్ బాబు, కృష్ణా క్రాంతి కుమార్, అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ కలిసి చేపట్టారు.
ఈ సందర్భంగా ఏసీపీ విత్తన షాప్ యజమానులను విచారించి, వారి వద్ద విక్రయించబడుతున్న విత్తనాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలను అమ్మడం గాని, బిల్లు లేకుండా విక్రయించడం గాని తీవ్ర నేరమని హెచ్చరించారు. అలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏవో శ్రీనివాస్ పలు కంపెనీల విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. మార్కెట్లో నకిలీ విత్తనాలను పూర్తిగా నివారించి, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు పూర్తి సహకారం అందించాలి అని సూచించారు. తనిఖీల సమయంలో అధికారులు కొన్ని అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించి, వాటిపై విచారణ చేపట్టారు. రైతుల హక్కులను కాపాడే దిశగా, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.