- మండలంలో ప్రెస్క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తా
- ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
సి.బెళగల్, క్రైమ్ మిర్రర్ః సి.బెళగల్ మండల ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మండల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని పసుపల గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా వేసి, గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల ను పరిష్కరిస్తానన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను అడగగా సానుకూలంగా స్పందించి మండలంలో ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.





