తెలంగాణరాజకీయం

రైతు భరోసా అప్డేట్: జనవరి 26 నుండి భూమి లేని రైతు కూలీలకు కూడా..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం 2026 యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుండి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 26న రైతు భరోసాతో పాటు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద భూమి లేని రైతు కూలీలకు కూడా రూ. 6,000 ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంది.

 

జనవరి 26 నుండి నిధుల జమ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందరి రైతుల ఖాతాల్లోకి నిధులు చేరడానికి సుమారు 10 రోజుల సమయం పట్టవచ్చు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇది ఫిబ్రవరి నెలకు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రతి ఎకరానికి ఏడాదికి ₹12,000 చొప్పున (విడతకు ₹6,000) సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ద్వారా సాగులో లేని భూములను (కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు) గుర్తించి, ఆ భూములకు ఇచ్చే నిధులను నిలిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు తమ వివరాలను మరియు చెల్లింపు స్థితిని తెలంగాణ రైతు భరోసా పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button