Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీకి పది గంటల విచారణ

ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీకి పది గంటల విచారణ

ఒంగోలు, క్రైమ్ మిర్రర్ :- ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)పై ఒంగోలు పోలీసులు దాదాపు పది గంటలుగా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజకీయ ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వివాదాస్పద ఫోటోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చిత్రాలను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఒంగోలు టూ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఉదయం నుండి స్టేషన్‌లో హాజరైన ఆర్జీవీని, సైబర్ క్రైమ్ మరియు స్థానిక పోలీసులు కలిసి పది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. మార్ఫ్ చేసిన ఫోటో రూపొందించిన ఉద్దేశం ఏమిటి?.. దాన్ని సోషల్ మీడియాలో పంచడంలో ఆయన పాత్ర ఏంటి?.. వంటి అంశాలపై కేంద్రీకరించి విచారణ సాగిస్తున్నారు.

Read also : అడిగినంత ఇవ్వకుంటే!.. ఉద్యోగం నుంచి తొలగిస్తా? తనిఖీల పేరుతో కక్షసాధింపు చర్యలు

తనపై వచ్చిన ఆరోపణలను ఆర్జీవీ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఫోటో తనవల్ల కాకుండా, ఇతరులు సృష్టించి ట్యాగ్ చేశారని వర్మ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, పోలీసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనపై టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. మరోవైపు, ఆర్జీవీ మద్దతుదారులు ఇది సృజనాత్మక స్వేచ్ఛపై దాడి అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Read also : సింధూ జలాల కోసం పాక్ రిక్వెస్ట్, ఎంబసీకి న్యూస్ పేపర్లు నిలిపేసిన భారత్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments