
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, మానసిక వైద్య నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) మంగళవారం కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై వేలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన ఇంద్రజాల ప్రదర్శనలు, మానసిక నిపుణుడిగా చేసిన కార్యక్రమాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.