తెలంగాణ

ఇజ్రాయెల్ లో తెలంగాణ పౌరుడు మృతి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు!

ఇజ్రాయెల్ లో తెలంగాణ వాసి మృతి చెందాడు. ఇజ్రాయెల్- ఇరాన్ యద్ధవాతావరణం నేపథ్యంలో జగిత్యాల పట్టణానికి చెందిన రేవెళ్ల రవీందర్ చనిపోయాడు. బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్ కు వెళ్లిన ఆయన తాజాగా గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ఎదరుచూపులు

రవీందర్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకల మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక నాయకులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అటు ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డికి కూడా విషయం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో వీలైనంత త్వరగా మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ తాజాగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసాగరంలో ముగినిపోయారు.

ఢిల్లీ తెలంగాణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్

అటు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేసింది. రెండు దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సాయం అందించేందుకు ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాంగ సమాచారం మేరకు తెలంగాణకు చెందిన ఎవరూ యుద్ధంలో ఇబ్బందులు పబుతున్నట్లుగా తెలియలేదని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ అధికారులు విదేశాంగశాఖతో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయాలతో టచ్ లో ఉంటున్నారు.

హెల్ప్ లైన్ నెంబర్లు:

ఆపదలో ఉన్న వాళ్లు..  సహాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రకటించారు.

1.వందన, పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ – +91 9871999044

2.జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157

3.జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ – +91 9910014749

4.సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి – +91 9949351270

Read Also: ఇరాన్ లో కల్లోలం, అర్మేనియా చేరిన భారతీయ విద్యార్థులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button