క్రైమ్

నల్గొండలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య – నిందితుడికి ఉరిశిక్ష

నల్గొండ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : నల్గొండ జిల్లాలో 2013లో 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద నేడు నల్గొండ జిల్లా కోర్టు ఉరిశిక్ష తీర్పును ఇచ్చింది. నిందితుడు మోహమ్మీ ముకఱ్ఱము, 2013లో నల్గొండలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. తర్వాత తన దుశ్చర్యల చరిత్రను బయటపెట్టకూడదనే ఉద్దేశంతో బాలికను హత్య చేసి, మృతదేహాన్ని సమీప కాలువలో పడేశాడు.

వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో, పోలీసులు పోక్సో చట్టం మరియు హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద మోహమ్మీ ముకఱ్ఱము పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు గత 10 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో విచారణలో కొనసాగింది. వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం, పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నేడు తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి ఉరిశిక్షతో పాటు ₹1.10 లక్షల జరిమానా విధించారు. ఈ తీర్పుతో, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే దుర్మార్గులకు ఇది గట్టి హెచ్చరికగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button