Homeతెలంగాణమరోసారి రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మరోసారి రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల వరకూ అధికారంలోకి రావడం కష్టమే అని స్పష్టంగా చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఆయన ఓ వీడియో ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నాయకుల వ్యవహారశైలి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా ఉందని వ్యాఖ్యానించారు.

నాయకులు మొండితనంతో ముందుకు సాగుతూ ఎవరి మాట వినడం లేదని, ఓటర్లను ఆకర్షించే విధానాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఎలా మన వైపు తిప్పుకోవాలో, ఎలా గెలవాలో కూడా ఆలోచించాలన్న ఆయన.. ఈ వ్యవహారంతో తెలంగాణలో బీజేపీ బలహీనపడుతుందని ఆయన తీవ్రంగా పేర్కొన్నారు.

అంతేకాక, తెలంగాణలో పార్టీ పూర్తిగా కుంగిపోతోందని, దయచేసి కిషన్ రెడ్డి గారు బీజేపీని కాపాడండి అని వేడుకున్నారు. అయితే, రాజాసింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి.

ALSO READ: డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

Most Popular

Recent Comments