
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ 18 వ సీజన్లో కప్పు నెగ్గింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత రజత్ పటిదార్ కెప్టెన్సీలో కప్పు నెగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో ఏళ్లుగ ఐపీఎల్ కప్పు లేకపోవడం వల్ల ఆ జుట్టు ప్లేయర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం చేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 184 పరుగులు చేసింది. దీంతో ఆరు పరుగులు తేడాతో పంజాబ్ కింగ్స్ పై ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు విక్టరీ నమోదు చేసింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఓటమి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి నన్ను, నా జట్టును తీవ్ర నిరాశకు గురిచేసింది అని తెలిపారు. ఈ మ్యాచ్ లో మేము తప్పక విజయం సాధించాల్సి ఉంది. గతంలో ఇలాంటి 200 పరుగుల లక్ష్యాన్ని చలానే చేదించాము. కానీ ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి బౌలర్సు చాలా చక్కగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ప్రదర్శన మ్యాచ్ని మలుపు తిప్పిందని కెప్టెన్ శ్రేయస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా జట్టులో ఈ సంవత్సరం చాలా మంది అనుభవం లేని కొత్త ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. కానీ వారి ప్రతిభ అసాధారణమని అన్నారు. వచ్చే ఏడాది కచ్చితంగా టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నారు. ఈ మ్యాచ్ లో నేను వెంటనే అవుట్ అవ్వకుండా ఉండాల్సింది అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి ..