తెలంగాణ

పోలింగ్ స్టేషన్లు ,ఓటర్ల చివరి జాబితా ప్రచురణ

మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండలములోని పోలింగ్ స్టేషన్ల, మరియు ఓటర్ల చివరి జాబితాను బుదవారం ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి ప్రచురించారు. మునుగోడు మండల వ్యాప్తంగా 69 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు 19048 మంది,పురుష ఓటర్లు 18990 మంది ,మొత్తం 38038 మంది ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారని ఎంపిడిఓ తెలిపారు. తమ తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల వివరాలు లిస్టు అందుబాటులో ఉంటాయని అన్నారు.

Read also : అల్లాపూర్ SHO వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించిన దేవరింటి మస్తాన్ రెడ్డి

Read also : ఇందిరమ్మ ఇల్లు నగదు చెల్లింపులో ఆధార్ సమస్యలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button