ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణ

దేవుడితోనూ రాజకీయాలా..? – తిరుమలలో వరుస వివాదాల వెనుక ఛీప్‌ పాలిట్రిక్స్‌

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : వరుస వివాదాలు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా..? గోశాలలో గోవుల మృతి, అన్యమత ప్రార్థనలు, పుణ్యక్షేత్రంలో నాన్‌వెజ్‌ వంటలు, క్యూలైన్‌లో భక్తుల నినాదాలు.. ఇవన్నీ ఏంటి…? ఈ వివాదాల వెనుక కుట్ర ఉందా..? అంటే అవునంటోంది టీడీపీ. వైసీపీ గ్యాంగ్‌ కావాలనే చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో గానీ… తిరుమల పవిత్రతకు మాత్రం భగం కలుగుతోంది.

ఏపీ రాజకీయాలు… తిరుమలను కూడా తాగాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేస్తోంది టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల గోశాలలో గోవుల మృతిపై రాద్దాంతం జరిగింది. ఆ తర్వాత… ఎవరో తిరుమల నమాజ్‌ వేసిన వీడియో బయటకు వచ్చింది. నిన్న గాక మొన్న… పుణ్యక్షేత్రంలో ఎగ్‌బిర్యానీ వివాదం నడిచింది. ఇప్పుడు… దర్శనం క్యూలైన్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ హంగామా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే… తిరుమలలో రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఇదంతా టీటీడీ వైఫల్యమేనా…? లేక ఇందులో రాజకీయ కుట్ర ఉందా…? అంటే.. వైసీపీ వైపు వేలు పెట్టి చూపిస్తోంది టీడీపీ. క్యూలైన్‌లో హంగామాకు సంబంధించి ఆధారాలను కూడా బయటపెట్టింది.

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో శ్రీవారి దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో.. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని… భక్తులు నినాదాలు చేశారు. ముఖ్యంగా అచ్చారావు అనే వ్యక్తి.. టీటీడీ చైర్మన్‌, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. కట్‌ చేస్తే… ఈ వీడియో వైసీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో… ఇది వైసీపీ కుట్ర అంటోంది టీడీపీ. అంతేకాదు… క్యూలైన్‌లో నినాదాలు చేసిన అచ్చారావు… కాకినాడకు చెందిన వైసీపీ నేత అని ఆధారాలతో సహా బయటపెట్టింది. కుట్ర రాజకీయాల కోసం… తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా వైసీపీ వెనకాడటం లేదన్నది టీడీపీ ఆరోపణ.

తిరుమలో జరగుతున్న కుట్రలపై… సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని.. అన్నీ తాను గమనిస్తున్నానని చెప్పారు. అందరిపై డేగ కన్ను వేచి ఉంచానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అరాచకాలు సృష్టించి… టీటీడీ ఫెయిల్‌ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాలో తనకు తెలుసని… తోక తిప్పితే… కట్‌ అయిపోతుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి. మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా వైసీపీ కుట్రలు మొదలయ్యాయని ఆయన ట్వీట్‌ చేశారు. పథకం ప్రకారమే… వైసీపీ పేటీఎం బ్యాచ్‌ డ్రామా చేస్తోంద్నారు. క్యూలైన్‌లో వారి మనిషితో నినాదాలు చేయించి… సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయించారని విమర్శించారు.

ఇక… క్యూలైన్‌లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదలు చేసిన అచ్చారావు అనే వ్యక్తి తన తప్పు తెలుసుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయన.. క్యూలైన్‌లో సౌకర్యాలు బాగానే ఉన్నాయని చెప్పారు. టీటీడీ చైర్మన్‌కు, అధికారులకు క్షమాపణలు కూడా చెప్పారు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల.. అసహనానికి గురయ్యానని… కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత.. భక్తుల కోసం సాంబార్‌ అన్నం.. పాలు అన్నీ పంపిణీ చేశారని చెప్పారు. టీటీడీని క్షమాపణలు కోరారు. ఈ వివాదం ముగిసినా… దీని వల్ల చెలరేగిన రాజకీయ రగడ మాత్రం రగులుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button