
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: –
ఈ నెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు పిలుపునిచ్చారు. చౌటుప్పల మండలంలోని చిన్న కొండూరు, పెద్ద కొండూరు, మందోల్లగూడెం, కుంట్ల గూడెం, పంతంగి, జై కేసారం, నేలపట్ల, ఎస్ లింగోటం, రెడ్డిబావి, ఆరెగూడెం, ధర్మోజిగూడెం, దండు మల్కాపురం, కైతాపురం, తూప్రాన్ పేట, కొయ్యలగూడెం, అంకిరెడ్డిగూడెం గ్రామాలలోని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గం మండల కమిటీ సభ్యులు ప్రజాసంఘాల జిల్లా ఆఫీస్ బేరర్ శాఖ కార్యదర్శులను కలసి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ……కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆధునిక కాలంలోను సమాజాన్ని తిరోగమానం వైపు తీసుకెళ్తాతుందని, ప్రపంచంలో ఎన్నో దేశాలు మన రాజ్యాంగాన్ని స్పుర్తిగా తీసుకొని తమ రాజ్యాంగాలను రూపొందించుకున్నాయని అన్నారు. కాని మన దేశంలోని మతోన్మాద శక్తులు మన రాజ్యాంగం పై దాడులు చేస్తూ, దేశాన్ని అన్ని విధాల ఆదోగతి పాలు చేస్తున్నాయని విమర్శించ్చారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలపై నిర్మితమైన చరిత్రను గుర్తుచేస్తూ, సమాజంలో దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించే విధంగా అనేక అడ్డంకులను అదిగమిస్తూ, పార్టీని భలోపేతం చేసే దిశగా కార్యకర్తలను నిర్మాణపరంగా తయారు చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న జిల్లా తరగతులను జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు బొజ్జ బాలయ్య, చింతల సుదర్శన్, మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, చెరుకు లక్ష్మమ్మ, కొంతం సుశీల, మీసాల శీను, షావుకారి రాజు, కొన్నింటి జంగయ్య, జెక్కిడి రమణారెడ్డి, కంచర్ల రాజు, చెరుకు రమేష్, చింతల మధు, గంగాదేవి రాజు, బాలగోని బాలరాజు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల మహేష్, కాసం వెంకటేశం తదితరులు పాల్గొన్నరు.
“ది సిటిజెన్ కోఆపరేటివ్” సొసైటీ చౌటుప్పల్ బ్రాంచ్ సభ్యుల సమావేశం