
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫొటో మొదలైంది. సిరిసిల్లలో మొదలైన ఈ గొడవ… ఇప్పుడు రాష్ట్రమంతా పాకింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో మస్ట్ అని.. ప్రొటోకాల్ పాటించాల్సిందే అని అంటోంది కాంగ్రెస్. అలా కుదరనే కుదరదని అంటోంది బీఆర్ఎస్. దీంతో.. రెండు పార్టీల మధ్య రగడ మొదలైంది. ఈ రచ్చ.. ఏ స్థాయికి వెళ్తుందో…? దేనికి దారి తీస్తుందో అన్న టెన్షన్ మొదలైంది.
తెలంగాణలో ఫొటో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఉండాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో.. గొడవకు దారితీస్తోంది. ఇటీవల సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని కాంగ్రెస్ నేతలు గొడవ చేశారు. అక్కడున్న కేసీఆర్ ఫొటో తీసేసి… రేవంత్రెడ్డి ఫొటో పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వరకు వెళ్లింది. ఈ గొడవలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో కింద పడి పగిలిపోయింది. ఈ ఇష్యూ తర్వాత… కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం ఫొటో ఉండి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేలంతా ప్రొటోకాల్ పాట్సించాల్సిందే తేల్చి చెప్తోంది. కానీ.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ససేమిరా అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం… అసలు ప్రొటోకాలే పాటించడంలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అధికారిక కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలవడం లేదని.. అది ప్రొటోకాల్ ఉల్లంఘటన కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. అందులో లేని ప్రొటోకాల్ ఇష్యూ… క్యాంప్ కార్యాలయాల్లో ఉన్న ఫొటోలో విషయం ఎందుకని నిలదీస్తున్నారు కారు పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం.. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు… అర్థంలేని వివాదాలు సృష్టిస్తోందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం.. పట్టు విడవడంలేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల్లో సీఎం ఫొటో పెట్టకపోవడం ప్రొటోకాల్ ఉల్లంఘటన కిందకు వస్తుందని… దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.