
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణలోనే కాదు ఇప్పుడు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఎన్నికలకు ముందు… చంద్రబాబు, లోకేష్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇది నిజమేనా…? ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది…? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ప్రధాన పాత్రధారి, SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత ఎన్నికల ముందు.. తెలంగాణలోని రాజకీయ నాయకులే కాదు.. ఏపీ లీడర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్కు మేలు చేకూర్చేందుకు… ఆయనకు ప్రత్యర్థులైన చంద్రబాబు, లోకేష్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం. వీరిద్దరితోపాటు టీడీపీ ముఖ్యనేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు.. సిట్ విచారణలో ప్రభాకర్రావు ఒప్పుకున్నారని అంటున్నారు. విదేశాల నుంచి కొన్న ప్రత్యేక పరికరం ద్వారా.. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సమాచారం.
Read Also :16 నెలల తర్వాత హైదరాబాద్ కు ప్రభాకర్ రావు.. కేసీఆర్ కు టెన్షన్
టీడీపీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేశారన్న సమాచారం రావడంతో… ఈ కేసు మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలనే కాదు… ఏపీకి చెందిన టీడీపీ నేతల ఫ్లోన్లు కూడా టార్గెట్ చేశారని తెలియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసుండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో… కీలక పాత్రధారి ప్రభాకర్రావును మరింత లోతుగా విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
అయితే.. సిట్ అడిగే అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడంలేదని సమాచారం. అయినా.. ఆయనతో సమాధానాలు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో బాధితులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు విచారణలో ముందు ముందు మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.