
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కొద్ది రోజుల క్రితం సింగపూర్లో స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన తర్వాత సోషల్ మీడియా అంతటా కూడా ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చిన్న చిన్న గాయాలతో బ్రతికి పోయాడు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా సింగపూర్ వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అయితే ఆ అగ్ని ప్రమాదం సంఘటన జరిగిన తరువాత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. తన కొడుకును ఇప్పుడు ఇండియాలోనే చదువుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే నిన్న అంటే శుక్రవారం నాడు తన చిన్న కుమారుడు మార్పు శంకరును పటాన్చెరువు సమీపంలో ఉన్నాం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేర్పించారు. ఈ స్కూల్ దాదాపు హైదరాబాద్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పచ్చదనంతో, భారీ భద్రతతో అలాగే ప్రకృతి వాతావరణంతో ఎంతో సుందరంగా ఉంటుంది. కేవలం విదేశీ విద్యార్థులు అలాగే భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను విదేశాల్లో కొనసాగించాలనుకునే వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ఈ స్కూల్ ను నిర్మించారు. ఈ స్కూల్లో ఎలిమెంటరీ నుంచి గ్రేడ్ 12 వరకు విద్యను అందిస్తారు. స్కూల్లో కేవలం అంతర్జాతీయ స్థాయి పాఠాలు మాత్రమే చెబుతారు. ఇక స్కూల్ మొత్తం మీద కేవలం 400 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఎవరికి కూడా వెంటనే అడ్మిషన్లు ఇవ్వరు. ఏదైనా విఐపి పర్సన్స్ లేదా రాష్ట్ర నెంబర్ వన్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు ఇస్తారు. అయితే ఇక పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ రెడ్డికి ఏకంగా ఎనిమిది నుంచి 12 లక్షల వరకు ఫీజు ఖర్చు అవుతుంది. అది కూడా ఓన్లీ అడ్మిషన్ కోసమే. ఏడాది కాలంలో ఏకంగా స్కూల్ ఫీజు మరియు ఇతర ఖర్చులు మొత్తం కలిపి దాదాపు పది లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని కొంతమంది అధికారులు చెప్తున్నారు.