
క్రైమ్ మిర్రర్, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం పైగా మళ్లీ ఒక విమానం ప్రయాణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీవారి రాజగోపురానికి అత్యంత సమీపంలో విమానం వెళ్లిన దృశ్యాలు భక్తుల్ని తీవ్రంగా కలచివేశాయి.
ఆగమ శాస్త్ర ప్రకారం, దైవస్థానాలపై ఎటువంటి విమాన రాకపోకలు అనుమతించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇవేTTD (తిరుమల తిరుపతి దేవస్థానం) ని మరోసారి నో ఫ్లై జోన్ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించేలా చేశాయి.
టీటీడీ అధికారుల ప్రకారం, “తిరుమల ఒక పవిత్ర క్షేత్రం. ఇక్కడ భగవంతుని ఆలయం మీదుగా ఏ ఒక్క విమానమూ గాలి చీల్చకూడదు. ఇది శాస్త్రవిరుద్ధం కావడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రాంతాన్ని పూర్తిగా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు.
ఇటీవల కూడా ఇలాగే ఓ ప్రైవేట్ విమానం ఆలయం పైగా ప్రయాణించడంపై భక్తులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల విశ్వాసాలకు తూట్లు పొడిచే ఈ ఘటనలపై ప్రభుత్వం గంభీరంగా స్పందించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా పరంగా కూడా, తిరుమల వంటి ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం పైగా విమానాలు ప్రయాణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని భద్రతా నిపుణులు చెబుతున్నారు.