
NTPC: దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతూ రైల్వే శాఖ ఎంతో పెద్ద శుభవార్తను ప్రకటించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 5,810 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకునే పలు ప్రముఖ పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ముఖ్యమైన ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా, నవంబర్ 27 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
ప్రతి ఆర్ఆర్బీ రీజియన్లో ఖాళీల సంఖ్య వేర్వేరుగా నిర్ణయించబడింది. అహ్మదాబాద్లో 79, అజ్మేర్లో 345, బెంగళూరులో 241, భువనేశ్వర్లో 231, బిలాస్పూర్లో 864 సహా 19 ప్రాంతాల్లో మొత్తం 5810 ఖాళీలు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అత్యధికంగా 3,416 ఉండగా, ఇతర పోస్టులూ గణనీయ సంఖ్యలో ఉన్నాయి.
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టైపిస్ట్కు సంబంధించిన పోస్టులకు అదనంగా ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి. వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు కల్పించబడింది.
ఎంపిక ప్రక్రియలో టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ప్రారంభ వేతనం రూ.25,500 నుంచి రూ.35,400 వరకు నిర్ణయించబడింది. సిలబస్లో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ అంశాలు ఉంటాయి. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 కాగా, ఇతర కేటగిరీలకు రూ.250గా ఉంది.
ALSO READ: వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు





