క్రైమ్

రఘువంశీపై మంత్ర ప్రయోగం, హనీమూన్ మర్డర్ కేసులో న్యూ ట్విస్ట్!

Honeymoon Murder Case:  మేఘాలయ హనీమూన్‌ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజా రఘువంశీకి పెళ్లైన కొత్తలోనే సోనమ్ మంత్ర ప్రయోగం చేసిందని.. బాధితుడి తండ్రి సంచనల ఆరోపణలు చేశారు. సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా పెళ్లైన మరుసటి రోజే తమ ఇంటికి ఏదో వస్త్రం కట్టారని వెల్లడించారు. సోనమ్ సూచనతోనే రాజ్.. ఇంటి చూరుకు ఏదో చిన్న వస్త్రం చుట్టి ఉన్న పొట్లాన్ని పెట్టారని తెలిపారు. ఎందుకని అడిగితే, దుష్ట శక్తులు, నర ఘోష తగలకుండా ఆ వస్త్రం కట్టినట్లు చెప్పారని వెల్లడించారు. ఆ తర్వాత తాము ఆ ప్యాకెట్ ను తొలిగించినట్లు చెప్పారు. ఈ తతంగాన్ని చూస్తుంటే సోనమ్, తమ కొడుకును చంపేందుకే ఇలా చేసిందనే అనుమానం కలుగుతుందన్నారు.

జోతిష్యం చూసే సంప్రదాయబద్దంగా వివాహం

తన కొడుకు సంసార జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే జ్యోతిష్కుడి సూచనల మేరకు సంప్రదాయబద్ధంగా సోనమ్, రఘువంశీ పెళ్లి జరిపించినట్లు బాధితుడి తల్లి చెప్పుకొచ్చారు. పెళ్లైన నాలుగు రోజులకు తమ ఆచారం ప్రకారం సోనమ్ తన పుట్టింటికి వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో తాము ఎంతో సంతోషంగా ఆమె సాగనంపినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె తమ ఇంటికి కోడలుగా వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డామని చెప్పారు. కానీ, తన కొడుకును చంపిస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

పెళ్లికి ముందే భర్త హత్యకు సోనమ్ ప్లాన్

మే 23న సోనమ్, రఘువంశీ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండాపోయారు. జూన్ 2న రఘువంశీ మృతదేహం లోయలో దొరికింది. ఆ తర్వాత వారం రోజులకు యూపీ ఘాజీపూర్ బస్ స్టాండ్‌ లో సోనమ్ కనిపించింది. తనకు ఎవరో మత్తుమందు ఇచ్చారని కట్టుకథ చెప్పింది. ఈ హత్యకు ఆమెకు సంబంధం ఉందని పోలీసులు అనుమానించారు. అనుకున్నట్లుగానే ఈ మర్డర్ కేసులో ఆమెదే మాస్టర్ మైండ్ అని తేలింది.ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్, యువతి హత్యకు ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button