జాతీయం

ఏడాదికి టోల్ చార్జీ జస్ట్ రూ. 3 వేలు.. కేంద్రం కీలక నిర్ణయం!

FASTag Annual Pass: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ చార్జీల నుంచి భారీ ఉపశమనాన్ని కల్పించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నాన్ కమర్షియల్ వాహనాలకు వార్షిక టోల్ పాస్ లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ రూ. 3,000 చెల్లించి ఈ టోల్ పాస్ ను తీసుకోవచ్చు. ఈ పాస్ యాక్టివేట్ అయిన దగ్గరి నుంచి ఏడాదిలోగా 200 ట్రిప్పుల వరకు జర్నీ చెయ్యొచ్చు. ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ పాస్ ను నాన్ కమర్షియల్ వాహనాలు అయిన కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైన వాటికే వర్తించనుంది. జాతీయ రహదారులపై 60 కి.మీ. లోపే టోల్‌ ప్లాజాలు ఉండటంపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పాస్ లను ఆగష్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఫాస్టాగ్‌ పాస్‌ ప్రత్యేకతలు ఇవే!

* ఈ పాస్ ధర రూ.3,000. ఒకేసారి పేమెంట్ చేసి తీసుకోవాలి. ఏడాది పాటు 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. అన్ని జాతీయ రహదారులపై ఈ పాస్ పని చేస్తుంది.

* కార్లు, జీపులు, వ్యాన్లు లాంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది.

* ప్రస్తుతం ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులు కొత్తగా మరో ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

* ఒక టోల్‌ ప్లాజాను దాటి వెళితే దానిని ఒక ట్రిప్పుగా లెక్కించబడుతుంది.

* ఈ పాస్ ద్వారా ఒక టోల్ ప్లాజాకు కేవలం రూ. 15 చెల్లించినట్టు అవుతుంది.

* ఏడాదిలోగా 200 ట్రిప్పులు పూర్తి అయితే, మళ్లీ పాస్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఎన్నిసార్లు అయినా ఈ పాస్ కొనుగోలు చెయ్యొచ్చు.

Read Also: పహల్గామ్ లో మళ్లీ తెరుచుకున్న పర్యాటక ప్రాంతాలు, టూరిస్టులు వచ్చేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button