క్రైమ్

ఇష్టం లేని పెళ్లి, హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించిన భార్య!

Meghalaya Honeymoon Murder: ఈ రోజుల్లో మనుషులు మరింత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తలను భార్యలు, భార్యలను భర్తలు చంపుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ఇష్టం లేని భార్య సోనమ్ భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు కిల్లర్స్ ను అరెస్టు చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఇండోర్ నివాసి అయిన రఘవంశీకి సోనమ్‌ తో ఈ నెల రెండో వారంలో పెళ్లి అయ్యింది. కొత్త జంట మే 20న మేఘాలయకు హనీమూన్ కు వెళ్లారు.  మే 22న వీరిద్దరు టూ వీలర్ ను రెంట్ కు తీసుకుని మౌలికాయత్ అనే ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రోజు నుంచి వీళ్లిద్దరు కనిపించకుండా పోయారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 10 రోజుల తర్వాత రాజా మృతదేహం లోతైన ఒక లోయలో కనిపించింది. తాజాగా అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అత తలపై రెండు తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఒకటి తల ముందు నుంచి, రెండవది వెనుక నుంచి తగిలినట్టు తేల్చారు. గాయాలు లోతుగా ఉండటంతో తీవ్ర రక్తస్రావం కలిగి చనిపోయినట్లు వెల్లడించారు.

కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిన భార్య

రఘవంశీ హత్యకు భార్య సోనమ్ కారణం అని పోలీసులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల అనుమానాన్ని నిజం చేస్తూ యూపీలోని ఘజియాపూర్‌ లో సోనమ్ పోలీసులకు లొంగిపోయింది. రఘవంశీ డెడ్ బాడీ కనిపించిన వారం రోజుల తర్వాత ఆమె సరెండర్ కావడంతో కేసు కీలక మలుపు తిరిగింది.  కిరాయి హంతకులతో భర్తను చంపడంతో పాటు ఆ హంతకులలో ఒకడైన రాజ్ కుష్వా తో సోనమ్ కు పెళ్లికి ముందే అఫైర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భర్త హత్యలో సోనమ్ ప్రమేయం ఉన్నట్టు మేఘాలయ డీజీపీ ఇడాశిష  కన్ఫర్మ్ చేశారు. సోనమ్ తో పాటు నలుగురు హంతకులను అరెస్టు చేసినట్లు వివరించారు.

Read Also: బరాత్ లో డీజే లొల్లి.. పెళ్లి కొడుకును కొట్టి చంపడమేంట్రా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button