
-
విధి నిర్వహణలోనే కుప్పకూలిన ఏఎస్సై – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన కృష్ణమూర్తి
మహబూబాబాద్, క్రైమ్ మిర్రర్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఏఎస్సై కృష్ణమూర్తి ఆకస్మికంగా గుండెపోటుకు గురై పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలిపోయారు. సహచర సిబ్బంది వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆయనను మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. అత్యంత విధేయతతో పనిచేసే కృష్ణమూర్తి హఠాన్మరణంతో సహచర పోలీసు సిబ్బందితో పాటు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై పోలీసు శాఖ సంతాపం వ్యక్తం చేస్తూ, కృష్ణమూర్తి సేవలను గుర్తు చేసుకుంది. మరణ వార్త తెలిసిన వెంటనే సహోద్యోగులు, స్థానిక అధికారులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు.