
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వైరాలు ప్రతిరోజు కూడా ముదిరిపోతున్నాయి. అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే ఈ దాడుల తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వం పై అలాగే నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో మంత్రి లోకేష్ తనను హతమార్చాలని చూస్తున్నారు అని జోగి రమేష్ కీలక ఆరోపణలు చేశారు. లోకేష్ ఆదేశాలతోనే ప్రస్తుత ఎంపీ చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు అని వ్యాఖ్యానించారు. ఈ దాడులు జరగక ముందే తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో డీసీపీ మరియు సిఐ చర్చించారు అని అన్నారు. పోలీసుల సపోర్ట్ లేకపోతే వాళ్లు మా పై దాడులు చేసే వాళ్ళ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గుండాలు ర్యాలీగా పెట్రోల్ సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్ గా నిలబడి వచ్చారు అంటూ.. ఈ దాడులు ఇలానే కొనసాగితే కచ్చితంగా ప్రజలు మీపై తిరగబడక మానురు అని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో జోగి రమేష్ చేసిన ఈ ఆరోపణలు వైరల్ గా మారాయి.
Read also : కాలనీ అభివృద్ధి కై కదలిరండి.. ఆదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి రాధారెడ్డి
Read also : India–US Trade Deal: ముందు ప్రధాని మోడీతో ఫోన్ లో ట్రంప్ చర్చలు, ఆ తర్వాతే డీల్ ఖరారు!





