
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో టీడీపీ పార్టీ ఎక్కడ కూడా ఫాలోయింగ్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త నాయకులను తీర్చిదిద్దుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ పార్టీకి చెందిన నాయకులు చాలామంది ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు ఇతర పార్టీల నాయకులు కండవ కప్పుకుని జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన పలు నాయకులు టీడీపీ, బీజేపీ లేదా జనసేన పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఏ నాయకులు అయినా కూడా టీడీపీలో చేరాలంటే మాత్రం కొన్ని కఠిన రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటన ద్వారా ఈ సరికొత్త విధానాన్ని బయటకు వెల్లడించారు. ఈ సరికొత్త విధానం ప్రకారం ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి టీడీపీలోకి చేరాలని అనుకుంటే… వారి వివరాలను టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయానికి పంపాలని తెలిపారు. తరువాత ఆ నాయకుడి యొక్క వివరాలను నియోజకవర్గస్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సమగ్రంగా పరిశీలించిన తర్వాతే టీడీపీ లోకి ఆమోదించాలా లేదా అనేది పార్టీ కేంద్రం నిర్ణయిస్తుందని అన్నారు. దీంతో పార్టీ మారాలని అనుకుంటే వెంటనే టీడీపీ మాత్రం వెంటనే జాయిన్ చేసుకునే రోజులు ఎప్పుడో గడిచిపోయాయని తెలిపారు. నిన్న మొన్నటి వరకు టిడిపి పార్టీలో చేరాలంటే నియోజకవర్గస్థాయిలో మంచి పేరు ఉంటే చాలు అని… ఆహ్వానించేవారు. అలా ఆహ్వానించిన తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చాలా సందర్భాలలో చూస్తున్న విషయమే. ఇలా ఇబ్బందుల వల్ల ఎంతోమంది నిజాయితీపరుల నాయకులు ఆయా పార్టీల నుంచి దూరమయ్యారు. దీంతో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా టీడీపీ అధిష్టానం ముందస్తు చర్యలలో భాగంగా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ నిర్ణయానికి చాలామంది నాయకుల నుంచి మంచి స్పందన రావడంతో టిడిపి అధిష్టానం కూడా భవిష్యత్తులో కూడా ఇలానే చేయాలని ఆలోచిస్తుంది.