
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిందే ఆయన కుమారుడు నారా లోకేషే. కానీ.. ఇప్పటి వరకు పార్టీపై లోకేష్కు సరైన పట్టులేదు. ఇప్పుడిప్పుడే పట్టు పెంచుకుంటున్నారు. చంద్రబాబులా లోకేష్ పార్టీని నడిపించగలడా అంటే డౌటే అంటారు చాలా మంది విశ్లేషకులు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుటే లోకేష్కు పార్టీని అప్పగించాలని కోరుకునేవారు టీడీపీలో కూడా చాలా మందే ఉన్నారు. కానీ.. ఆ దిశగా చంద్రబాబు ప్రయ్నతించడంలేదు. ఈ సమయంలో… చంద్రబాబుకు సలహా ఇచ్చారు ఎంఐపీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అంతేకాదు… లోకేష్ భవిష్యత్ను చంద్రబాబే నాశనం చేస్తున్నారని అని అన్నారు. ఆయన అలా ఎందుకు అన్నారు..? అసదుద్దీన్ ఓవైసీ మాటల వెనుక అర్థం ఏంటి…? అంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Read Also : ఏపీ సీఎం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు సుమన్!..
అసలు ఏం జరిగిందంటే… ఎంఐఎం పార్టీ సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్కు పాజిటివ్గా మాట్లాడారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ను.. చంద్రబాబే చేజేతులా నాశనం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు… ఎన్నో పదవులు అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు సీఎంగా పనిఏశారు. 15ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు రెండోసారి కూడా సీఎం పదవి అనుభవిస్తున్నారు. ఆయనకు ఇంకేం కావాలి… అంటూ మాట్లాడారు. చంద్రబాబు పదవులు అనుభవించింది చాలని.. ఇకనైనా లోకేష్కు అవకాశం ఇవ్వాలన్నారు. లోకేష్కు టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. లేదంటే… లోకేష్ రాజకీయ భవిష్యత్ను నాశనం చేసిన వారవుతారని కామెంట్ చేశారు. అంతేకాదు… జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తెచ్చారు ఓవైసీ. జూనియర్ ఎన్టీఆర్కి పాపులారిటీ ఉన్నా… ఆయన రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపించడంలేదని… కనుక లోకేష్కు పోటీ ఎవరూ లేరని అన్నారు. లోకేష్ బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని చెప్పారు.
లోకేష్కు టీడీపీ బాధ్యతలు అప్పగించడం అనేది ఆ పార్టీ అంతర్గత విషయం. మరి.. ఓవైసీ ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారు..? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. అందుకనే ఓవైసీ ఇలా మాట్లాడారా…? అన్న చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.