
Namaskar from space: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షం నుంచి తొలి సందేశాన్ని పంపించారు. ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నట్లు వెల్లడించారు. నిన్న(జూన్ 25న) మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా రోదసి ప్రయాణం మొదలుపెట్టారు. అంతరిక్షయానం చేస్తున్న ఆయన, తాజాగా తన సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నా!
తోటి ఆస్ట్రోనాట్స్ తో కలిపి అంతరిక్షయానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని శుభాన్షు వెల్లడించారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు. నిజంగా ఈ జర్నీని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే చిన్నారిలా నడవడం నేర్చుకుంటున్నట్లు వెల్లడించాడు. జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నట్లు తెలిపారు. ఎలా కదలాలో, ఎలా నియంత్రించుకోవాలో? ఎలా తినాలో తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయాణం సందర్భంగా తన అనుభవాలతో ఈ సందేశాన్ని పంపించారు.
ఇస్రో, నాసా భాగస్వామ్య మిషన్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనాట్స్ ను పంపించి అక్కడ పలు ప్రయోగాలు చేయించేందుకు అమెరికాకు చెందిన కమర్షియల్ స్పేస్ ఏజెన్సీ ‘యాక్సియం స్పేస్’.. నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రో భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎక్కువ కాలం పట్టే అంతరిక్షయాత్రలో హ్యోమగాముల శారీరక మార్పులతో పాటు పలు అంశాలపై ఈ మిషన్ లో పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలపై కలిగే ప్రభావంతో పాటు మొత్తం 60కి పైగా శాస్ట్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ యాక్సియం-4 మిషన్ కు భారత్ కు చెందిన హ్యోమగామి శుభాన్షు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. భారత్ నుంచి ఇప్పటికే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లగా, సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత శుభాన్షు అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు.
Read Also: అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు