తెలంగాణ

భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్!

IMD Issues Heavy Rain Alert: రుతు పవనాల రాకతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నారు. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిపిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జనగాం సిద్ధిపేట యాదాద్రి భువనగరి, రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని వెల్లడించింది.

పశ్చిమ కనుమలలో భారీ వర్షాలు
ముఖ్యంగా పశ్చిమ కనుమలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 15 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్‌ తో పాటు 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

మరోవైపు మలప్రభ నదిలోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. కర్నాటకలోని బెళగావి  జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి దగ్గర వరద పొంగిపొర్లుతోంది. కుసుమళి గ్రామం దగ్గర నదికి అడ్డంగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగున్నాయి. భారీ వరదతో నిర్మాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద తీవ్రతకు కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది. బెళగావి నుంచి జాంబోటె-చోర్ల మార్గంగా గోవాకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. పాత వంతెన తొలగించి కొత్త వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో తాత్కాలికంగా మట్టిరోడ్డును నిర్మించి రాకపోకలు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బెళగావి నుంచి గోవాకు ఖానాపుర,  రామనగర మార్గం నుంచి వాహనాలను దారి మళ్లించారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ మళ్లింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Read Also: వామ్మో అయోధ్య, భూములకు ఇంత ధరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button