
వనపర్తి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : వనపర్తి జిల్లా రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసి వారికి మిల్లింగ్ చేయడానికి అప్పగిస్తే కొంతమంది రైస్ మిల్ యజమానులు దాన్యమును పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఆ రైస్ మిల్లు బ్లాక్ లీస్టులో పెట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై వనపర్తి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల ధాన్యం బయట మార్కెట్ కు వెళ్ళిపోయింది.
ఈ ధాన్యం స్థానంలో పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసి దానిని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ధాన్యాన్ని బయట మార్కెట్లో 3500 రూపాయలకు అమ్మకాలు జరిపి, 2 వేల 800 కు పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత గులాబీ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు కేటాయించిన దాన్యం పక్కదారి పడుతుంది. శుక్రవారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖ పురం గ్రామం నుంచి విమల ఇండస్ట్రీస్ యజమాని అక్రమంగా ధాన్యం కర్ణాటక రాష్ట్రం రాయచూరు కు తరలిస్తుండగా గ్రామస్తులు ధాన్యం ఉన్న లారీని పట్టుకొని పోలీసులు సమాచారం తెలియజేశారు.
ఈ ధాన్యమునకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు,వే బిల్లులు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ లారీల్లో 384 ధాన్యం బస్తాలు 288 క్వింటాల వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు అవినీతికి చోటు కల్పించకుండా, అక్రమంగా ధాన్యమును తరలిస్తున్న రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి, పలువురు డిమాండ్ చేస్తున్నారు..ఈ విషయంపై స్థానిక ఎస్సై యుగంధర్ రెడ్డిని వివరణ కోరగా, శుక్రవారం రాత్రిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారిని స్థానికులు సమాచారం తెలిపితే పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించామని వెల్లడించారు.
ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో పంచనామా చేయడం జరుగుతుందని వాళ్లు ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.