వినూత్న ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, క్రైం మిర్రర్ః
ఓట్లు రావాలంటే మంత్రులు కూడ ఆటో డ్రైవర్లుగా మారాల్సిందే అన్న చందంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దానిని నిజం చేసి చూపారు.
హుస్నాబాద్ మున్నిపల్ ఎన్నికల్లో వినూత్న శైలిలో ప్రచారం చేస్తూ రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపారు. తన అధికార హోదాను పక్కన పెట్టి స్వయంగా ఆటో డ్రైవర్గా మారి ప్రచారం ఇప్పుడు హుస్నాబాద్లో హాట్ టాపిక్ మారింది.
ఆయన చేసిన ప్రచారం కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రజలతో నేరుగా పలకరిస్తూ కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు వివరించారు.





