
Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతుంది ఇండియన్ రైల్వే. ఇబ్బందిలేని ప్రయాణ అనుభాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు
హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి జూలై 2 నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రెండు నగరాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. 07230 నెంబర్ గల హైదరాబాద్- కన్యాకుమారి ప్రత్యేక రైలు జూలై 2, 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం 5.20 గంటలకు ప్రయాణాన్ని మొదలుపెట్టి, మూడోరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇక 07229 నెంబర్ గల కన్యాకుమారి- హైదరాబాద్ ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25 తేదీల్లో కన్యాకుమారి నుంచి బయల్దేరుతుంది. తెల్లవారుజామున 5.15 గంటలకు ఈ రైలు అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
హైదరాబాద్- కన్యాకుమారి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి సహ ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రెండు వైపులా రైళ్లు హాల్టింగ్ తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.