తెలంగాణ

అయ్యప్ప సొసైటీలో అన్ని అక్రమ నిర్మాణాలే.. యాక్షన్ తప్పదన్న హైడ్రా

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. బుల్జోజర్లను బరిలోకి దింపింది. బాహుబలి బుల్జోజర్ లో పెద్ద భవనాన్ని నేలమట్టం చేసింది.శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజీలోని అయ్య‌ప్ప‌ సొసైటీ స‌ర్వే నంబ‌రు 11/5 లో ప్లాట్ నంబ‌రు 5/13 పేరిట 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన‌ భ‌వ‌నాన్ని హైడ్రా ఆదివారం కూల్చివేసింది. స్థానిక పోలీసులతో పాటు హైడ్రాకు చెందిన డీఆర్ ఎఫ్ సిబ్బంది బందోబ‌స్తు నిర్వ‌హించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంత‌స్తుల (సెల్లార్ నుంచి 7 అంత‌స్తులు) భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై స్థానికుల ఫిర్యాదు మేర‌కు హైడ్రా ఈ కూల్చివేత‌లు చేప‌ట్టింది. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌ల‌సి అయ్య‌ప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న క‌ట్ట‌డాన్ని శ‌నివారం హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు.

Read Also : తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన

100 అడుగుల విస్తీర్ణంలో ముందు ఉన్న ర‌హ‌దారికి ఆనుకుని ఎలాంటి సెట్ బ్యాక్‌లు వ‌ద‌ల‌కుండా.. త‌గిన పార్కింగ్ సౌక‌ర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా .. సెల్లార్‌లోనే కిచెన్ ఉండేలా నిర్మించిన‌ట్ట హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ అక్ర‌మ భ‌వ‌న నిర్మాణాన్ని కూల్చివేస్తున్న‌ట్టు 14.2.24న షోకాజ్ నోటీసులు జీహెచ్ ఎంసీ జారీ చేసింది. అలాగే 26.2.24న స్పీకింగ్ ఆర్డ‌ర్ కూడా ఇచ్చింది. హైకోర్టు కూడా రిట్ పిటిష‌న్ నంబ‌రు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్ర‌మ నిర్మాణ‌మ‌ని నిర్ధారించ‌డ‌మే కాకుండా కూల్చివేత‌ల‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని 19.4.24 తేదీన ఆదేశించింది.హైకోర్టు ఆర్డ‌ర్ ను ఆధారంగా తీసుకుని 13.06.2024 త‌ర్వాత భాగాన్ని కూల్చివేసింది. ఇవేవీ ప‌ట్టించుకోకుండా నిర్మాణాన్ని కొన‌సాగించారంటూ స్థానిక అధికారులు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు.కూల్చివేత‌కు సంబంధించి షోకాజ్ నోటీసుతో పాటు హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చినా ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మించ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. అక్క‌డిక‌క్క‌డే కూల్చివేత‌ల‌కు సంబంధించి జీహెచ్ ఎంసీ చందాన‌గ‌ర్ స‌ర్కిల్ అధికారులు 14.2.24న ఇచ్చిన షోకాజ్ నోటీసుల‌తో పాటు హైకోర్టు ఉత్తర్వుల‌ను క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ప‌రిశీలించారు.

Also Read : త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌.. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అన్నీ ప‌రిశీలించాక కూల్చివేత‌ల‌కు ఆదేశించారు. దీంతో ఆదివారం ఆ భ‌వ‌నాన్ని హైడ్రా అధికారులు కూల్చేశారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టడాలు అక్రమమే. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన కట్టడాలను హైడ్రామొదటగా కూల్చివేత ప్రారంభించిందని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలిపారు. ఆదివారం కూల్చేసిన భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు ఇచ్చిన అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా హైడ్రా నివేదిక త‌యారు చేస్తోంది.అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల్లో అనేక హాస్టళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఈ అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారు. ఆయా భ‌వ‌నాల‌కు ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేవు అనేది స్ప‌ష్టం. అక్ర‌మ నిర్మాణాల‌తో మురుగు నీటి వ్య‌వ‌స్థ కూడా బాగా దెబ్బ‌తింది. దీంతో ఆ ప‌రిస‌రాలు మురుగు మ‌యంగా మారుతున్నాయి. ర‌హ‌దారుల్లో మురుగు నీరు పారుతున్న దృశ్యాలు క‌నిపించాయి. ఇది మౌలిక సదుపాయాలపై (డ్రెయినేజ్ పైపులపై) అధిక భారం వల్ల జరుగుతోంది.అయ్య‌ప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు GHMC కమిషనర్‌తో సమీక్ష నిర్వహించి సమన్వయంతో చర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి : 

  1. మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!
  2. భారత్‌లో తొలి HMPV కేసు..?.. 8 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!!
  3. ప్రారంభమైన హైడ్రా గ్రీవెన్స్.. స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ రంగానాథ్
  4. హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
  5. వెల్‌కమ్‌ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Back to top button