విజయవాడ, క్రైమ్ మిర్రర్ : ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ప్రయాణాలు సులభతరంగా చేసేందుకు విజయవాడ-హైదరాబాద్ మధ్య ‘ఫ్లై91’ నయా విమాన సర్వీసు: ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి హైదరాబాద్కు ప్రముఖ ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (Fly91) తన నూతన సర్వీసును ఈ రోజు అధికారికంగా ప్రారంభించింది.
న్యూఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కొత్త సర్వీసును వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం విమానాశ్రయంలో విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ‘ఫ్లై91’ ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని చిన్న నగరాలను విమాన మార్గాల ద్వారా అనుసంధానించేందుకు (Regional Connectivity Scheme – UDAN) అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
విజయవాడ-హైదరాబాద్ రూట్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి అని, కొత్త సర్వీసు ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభించిన ఫ్లై91 సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ నుంచి బయలుదేరే సమయం: ఉదయం 7:30 గంటలకు, హైదరాబాద్ చేరుకునే సమయం: ఉదయం 8:40 గంటలకు ఉన్నట్లు పేర్కొన్నారు.
