Tuesday, February 24, 2026
Homeతెలంగాణఅర్హులైన యువకులకు సువర్ణ అవకాశం:- కాంగ్రెస్ యువ నాయకులు ఓడేటి లచ్చిరెడ్డి

అర్హులైన యువకులకు సువర్ణ అవకాశం:- కాంగ్రెస్ యువ నాయకులు ఓడేటి లచ్చిరెడ్డి

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ కొత్త పథకాన్ని రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కాగా.. రాష్ట్రంలోని అర్హులైన యువకులకు ప్రభుత్వం రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవాలని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు ఓడేటి లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.

బిగ్ బ్రేకింగ్… హత్య కేసులో డీఎస్పీ పై వేటు.

శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న “అయోధ్య”…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments