
క్రైమర్ మిర్రర్, జాతీయ న్యూస్:- బంగారం ధరలు ప్రతిరోజు కూడా దోబూచులాడుతూ ఉన్నాయి. ఒక్క రోజులో.. ఒక్కో క్షణం ధరలు పెరుగుతూ, తగ్గుతూ జనాల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. కొన్ని గంటల క్రితమే భారీగా తగ్గిన బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. బంగారం మరియు వెండి ధరలు నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా చాలా తగ్గినట్లు వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రం నుంచి మెల్లిమెల్లిగా బంగారం మరియు వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 760 రూపాయలు పెరిగి ప్రస్తుతం 153930 రూపాయలకు పలుకుతుంది. మరోవైపు క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలు పెరిగి 1,4200 వేల రూపాయలకు చేరింది. దీంతో ప్రజలు సైతం ఈ బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో అని అయోమయంలో ఉన్నారు. మరోవైపు వెండి సైతం మెల్లిగా పెరుగుతూ పోతుంది. నిన్నటి వరకు శాంతించిన బంగారం ధరలు ఈరోజు నుంచి మళ్లీ పెరిగిపోతుండడం చూసి ప్రజలు బంగారాన్ని ఎప్పుడూ కొనుగోలు చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తులు కూడా ఏ సమయంలో ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలు ఏర్పడ్డాయి.
Read also : కోపంతో నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడునే చంపిన ప్రియురాలు?
Read also : Breaking: మున్సిపల్ ఎన్నికలు సందర్బంగా అందరికి సెలవులు..!





