తెలంగాణ

మాకు క్యాబినెట్ లో చోటు ఇవ్వండి…!

వికారాబాద్ జిల్లా, క్రైమ్ మిర్రర్ న్యూస్:- తెలంగాణలో త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గాలకు కూడా అవకాశం కల్పించాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్,చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య,మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ప్రభుత్వ విఫ్,ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని తెలిపారు.మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, పీసీపీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కి తెలిపే ఢిల్లీ వచ్చాం.మాది న్యాయమైన డిమాండ్. మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాలి. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలి.మాదిగ వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా ఉంది. మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మాకు అభ్యంతరం లేదు.మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి ఢిల్లీ వచ్చాం. మంత్రివర్గంలో మాదిగలకు కచ్చితంగా స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాం.మొదటి కేబినెట్ ఏర్పాటులో మాకు అవకాశం దక్కుతుందని భావించాం. ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గంలో ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు’ అని వారు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో అడ్లూరు లక్ష్మణ్,ఎమ్మెల్యేలు కాలే యాదయ్య,మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు.

యాదగిరిగుట్టలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణతరగతులను జయప్రదం చెయ్యండి

“ది సిటిజెన్ కోఆపరేటివ్” సొసైటీ చౌటుప్పల్ బ్రాంచ్ సభ్యుల సమావేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button