
క్రైమ్ మిర్రర్, యాదాద్రి భువనగిరి జిల్లా::- బావిలో పడిన దూడను కాపాడబోయి రైతు మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు బావిలో పడిన దూడను పైకి తీసే క్రమంలో అదుపుతప్పి రైతు తునం నర్సయ్య (70) బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు నర్సయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.