క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- T20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు సూపర్-8 లో మొట్టమొదటి మ్యాచ్ లోనే ఘోరపరాజయం పొందింది. సౌత్ ఆఫ్రికా లో జరిగిన మ్యాచ్లో ఏకంగా 76 పరుగులు తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశలో ఉంటే హార్దిక్ పాండ్యా మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మతో జల్సాలు చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా మండిపడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న శ్రద్ధ ఆటపై పెడితే బాగుంటుంది అని హార్థిక్ పాండ్యా పై సాటిర్లు వేస్తున్నారు. జట్టులోని ఆటగాళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జట్టు ఓడిపోతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈమధ్య కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తన భార్యతో కలిసి పలుచోట్ల తిరగడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఫాన్స్ ను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. భారత జట్టు ఈసారి కూడా టి20 వరల్డ్ కప్ గెలవాలి అని కొన్ని కోట్ల మంది కలలు కంటున్నారు. ఆ కలలను నిజం చేయాలి అంటే జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఆటపై శ్రద్ధ పెట్టడం అవసరమని అంటున్నారు. గర్ల్ ఫ్రెండ్స్, భార్యలతో షికారులకు ప్రత్యేక సమయం అనేది ఒకటి ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ ఆటగాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ టి20 వరల్డ్ కప్పులో భారత్ సెమిస్ కి చేరాలి అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి రెండు మ్యాచ్లలోనూ ఘన విజయాన్ని సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా హైలో ఉంచుకోవాలి.

