Homeతెలంగాణప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి!.. జిల్లా వైద్యాధికారి

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి!.. జిల్లా వైద్యాధికారి

క్రైమ్ మిర్రర్ , వెంకటాపూర్:-మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జవహర్ నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ ను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గోపాలరావు జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందేందుకు చేసే మౌలిక ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్ పరిసరాలను పరిశీలించి నాటిన ఔషధ మొక్కలను, రికార్డులను, మందుల నిల్వల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందినట్లయితే మౌలిక సదుపాయాలతో పాటు, ప్రజలకు ఉచిత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని సిబ్బందికి వివరించారు.

ప్రేమ జంట ఆత్మహత్య!… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం?

అందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి, జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపును పొందాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సమయపాలన పాటించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, జాతీయ కార్యక్రమాల లక్ష్యాలను 100 శాతం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసూతులను చేయించాలని సిబ్బంది, ఆశాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సంఘమిత్ర, ఆరోగ్య కార్యకర్త ఫాతి మున్నీసా, స్వర్ణలత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆరిపోయే దీపంలా కేటీఆర్ మాటలు!.. కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments