తెలంగాణ

రావిర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

మహేశ్వరం ప్రతినిధి, క్రైమ్ మిర్రర్ : నిరుపేదలకు గృహ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల రెండవ వార్డులో కేశంగారి బాబుకు ఇండ్ల పట్టాను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోద పాండురంగారెడ్డి, రెండవ వార్డు అధికారి మనోహర్, మాజీ ఎంపీటీసీ మునుగని రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఎరుకలి రామస్వామి, గోణెమోని బాల్ రాజ్, కోటగల్ల రాజ్ కుమార్, కోటగల్ల రంజిత్ కుమార్, బుసనగారి స్వామి, పొట్టోళ్ళ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని సాంప్రదాయరీతిలో ముగ్గులతో అలంకరించి, లబ్ధిదారులకు పట్టాలు అందజేసి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. “ఇంటిల్లు కలే కాదు, హక్కు” అని పేర్కొంటూ, ప్రతి అర్హ పేదవాడికి మద్దతుగా నిలుస్తామని నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button