Thursday, March 19, 2026
Homeక్రైమ్Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)

Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)

Crime: యూపీలోని ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అద్దె బకాయిల కోసం ఇంటికి వచ్చిన మహిళా యజమానిని అద్దె ఇంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో దాచిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ సంఘటన రాజ్‌నగర్ ప్రాంతంలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న అజయ్ గుప్తా, అకృతి దంపతులు 6 నెలలుగా ఇంటి అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని దీప్‌శిఖా అద్దె బకాయిల కోసం వారిని ప్రశ్నించేందుకు ఇంటికి వచ్చింది. అద్దె చెల్లింపుపై మాటమాట పెరగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

వాగ్వాదం కాస్తా హింసాత్మకంగా మారడంతో దంపతులు దీప్‌శిఖాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో ప్యాక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సూట్‌కేస్‌ను ఇంట్లోని మంచం కింద దాచిపెట్టారు.

కొన్ని రోజులుగా ఇంటి యజమాని కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అజయ్ గుప్తా దంపతుల నివాసాన్ని తనిఖీ చేయగా ఈ భీకర నిజం వెలుగులోకి వచ్చింది.

ఇంటి లోపల విచారణ చేపట్టిన పోలీసులు మంచం కింద దాచిన సూట్‌కేస్‌ను తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. అందులో దీప్‌శిఖా మృతదేహం ముక్కలుగా లభించింది. వెంటనే అజయ్ గుప్తా, అకృతి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అద్దె డబ్బుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.

ఈ ఘటనతో రాజ్‌నగర్ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అద్దె వివాదం ఇంతటి దారుణానికి దారితీసిందా అంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడవలు ప్రాణాలు తీసే స్థాయికి చేరకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై హత్య, ఆధారాలు నాశనం చేసిన కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: Murder: అక్క వరుసయ్యే యువతితో ఎఫైర్.. యువకుడి దారుణ హత్య

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments