
Crime: యూపీలోని ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అద్దె బకాయిల కోసం ఇంటికి వచ్చిన మహిళా యజమానిని అద్దె ఇంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేస్లో దాచిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ సంఘటన రాజ్నగర్ ప్రాంతంలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
UP | Ghaziabad — a shocking case of greed and brutality.
A landlord was brutally murdered by his own tenants after repeatedly demanding pending rent.
Accused Ajay Gupta and his wife Aakriti Gupta allegedly killed the landlord, wrapped the body in a red blanket, packed it in a… pic.twitter.com/y30epSj3pc
— ShoneeKapoor (@ShoneeKapoor) December 18, 2025
పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్నగర్లో నివసిస్తున్న అజయ్ గుప్తా, అకృతి దంపతులు 6 నెలలుగా ఇంటి అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని దీప్శిఖా అద్దె బకాయిల కోసం వారిని ప్రశ్నించేందుకు ఇంటికి వచ్చింది. అద్దె చెల్లింపుపై మాటమాట పెరగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వాగ్వాదం కాస్తా హింసాత్మకంగా మారడంతో దంపతులు దీప్శిఖాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేస్లో ప్యాక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సూట్కేస్ను ఇంట్లోని మంచం కింద దాచిపెట్టారు.
కొన్ని రోజులుగా ఇంటి యజమాని కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అజయ్ గుప్తా దంపతుల నివాసాన్ని తనిఖీ చేయగా ఈ భీకర నిజం వెలుగులోకి వచ్చింది.
ఇంటి లోపల విచారణ చేపట్టిన పోలీసులు మంచం కింద దాచిన సూట్కేస్ను తెరిచి చూసి షాక్కు గురయ్యారు. అందులో దీప్శిఖా మృతదేహం ముక్కలుగా లభించింది. వెంటనే అజయ్ గుప్తా, అకృతి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అద్దె డబ్బుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.
ఈ ఘటనతో రాజ్నగర్ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అద్దె వివాదం ఇంతటి దారుణానికి దారితీసిందా అంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడవలు ప్రాణాలు తీసే స్థాయికి చేరకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై హత్య, ఆధారాలు నాశనం చేసిన కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: Murder: అక్క వరుసయ్యే యువతితో ఎఫైర్.. యువకుడి దారుణ హత్య





