అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తా… కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలికేటి భరత్
క్రైమ్ మిర్రర్ ప్రతినిది, వేములపల్లి : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం మూడవ రోజు వామపక్షాలు కాంగ్రెస్ పొత్తుతో బలపరిచిన లక్ష్మీదేవిగూడెం అభ్యర్థి ఎలికేటి భరత్ 8 మంది వార్డు మెంబర్లు మంగళవారం ఆమనగల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ శాఖలు చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీదేవిగూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఎలికేటి భరత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
Also Read:SHOCKING: వైసీపీ నేత రాసలీలలు.. వీడియో వైరల్
దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు..గ్రామ పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా గ్రామం కోసం మీ సేవకుడిగా పని చేస్తానని పారదర్శక పాలన సమాన అభివృద్ధిగా పని చేస్తానని అన్నారు.ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా గ్రామంలోనే ఉంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మీ ఆశీర్వాదమే నా గెలుపుకు లక్ష్యమని అన్నారు.ఒక్కసారి సర్పంచ్ గా నన్ను గెలిపించి ఆశీర్వదించండి గ్రామ అభివృద్యే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.విద్యావంతులు కావడంతో గ్రామంలోని ప్రతి సమస్యపై అవగాహన ఉన్న నాయకుడిగా ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానని అన్నంరు.
Also Read:Munnar Elections: నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అధ్యర్థిగా సోనియా గాంధీ పోటీ!
గ్రామ ప్రజల సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి గ్రామస్తుల సహాయంతో గ్రామపంచాయతీ అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఎం పార్టీ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు…
Also Read:నేడు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..!
Also Read:Crime Mirror Updates: తెలంగాణ 02-12-25 ముఖ్యమైన వార్తలు





