ఆంధ్ర ప్రదేశ్

“తల్లికి వందనం” పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్లలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఇస్తామని తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ పథకం కోసం కొంత నిధులు అనేవి కేటాయించారు. హామీ ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పినా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే ఈ సమయంలోనే ఈ పథకం ఎవరికి అర్హత కలిగి ఉంటుందనేది.. ఎవరెవరు ఎంపిక అవుతారు అనేది కీలకం కానుంది.

బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్?

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలుపైన స్పష్టత అనేది ఇచ్చారు. గతంలో ఏ హామీ అయితే ఇచ్చామో… అదేవిధంగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో 9407 కోట్లు ఈ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 5540 కోట్లు ఈ పథకానికి కేటాయించగా.. ఇప్పుడు కోటమీ అధికారంతో పోలిస్తే 50% అధికమని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమికంగా 69 లక్షల మంది పథకానికి అర్హులుగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. అయితే త్వరలోనే మార్గదర్శకాలను అధికారులు తెలుపనున్నారని తెలిపింది.

మద్దూర్ లో అందుబాటులో లేని వెటర్నరీ డాక్టర్ సిబ్బంది!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button