
ఏపీ కాంగ్రెస్లో కీలక మార్పులు జరగబోతున్నాయా..? రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా..? జగన్పై కోపంతో.. కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు ఆమెపై ఉన్న ఆరోపణలు హస్తిన వరకు వెళ్లాయా..? పార్టీ మేలు కోసం.. షర్మిలను తప్పించడమే బెటరని అధిష్టానం యోచిస్తోందా…? అంటే… అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. త్వరలోనే షర్మిలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. వైసీపీ మళ్లీ కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా వ్యూహాలు కూడా రచ్చిస్తోంది. జనసేన కూడా బలం పెంచుకుంటోంది. మరి.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి…? అన్నదే ఇప్పుడు ప్రశ్న. 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి తర్వాత.. ఏపీలో కాంగ్రెస్ను బలోపేతలం చేయాలని.. షర్మిలకు బాధ్యతలు అప్పిగించింది అధిష్టానం. ఆమెను ఏపీకి చీఫ్గా పంపింది. కానీ.. షర్మిల పార్టీ మేలు కంటే… వ్యక్తిగత కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఓడిపోయిన జగన్పై, ఆయన పార్టీపై విమర్శలు చేస్తూ.. పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని షర్మిలపై ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆమె తీరు వల్ల.. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : డాదికే సర్వేలు… ఊహించని అభిప్రాయాలు చెబుతున్న ప్రజలు?
ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అయితే… షర్మిల తీరును తూర్పారబెడుతున్నారు. నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ షర్మిల వ్యతిరేకంగా సంతకాలు కూడా సేకరిస్తున్నారట. షర్మిల.. కూటమికి ఫేవర్గా ఉన్నారని… వారు ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని.. పార్టీ బలోపేతానికి కృషిచేయడం లేదని విమర్శిస్తున్నారు. పవర్లో పార్టీని ప్రశ్నించకుండా… ప్రతిపక్షంలో పార్టీని ప్రశ్నించడం వల్ల.. ఉపయోగం ఏంటని.. ఆమె నిలదీస్తున్నారు. షర్మిల పనితీరుపై.. హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారట కొందరు కాంగ్రెస్ సీనియర్లు. దీంతో…షర్మిల చెక్ పెట్టే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ భారీ మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారట.