
క్రైమ్ మిర్రర్, నల్గొండ-:-
జిల్లాలోని చండూర్ మండలంలో శుక్రవారం అంగడి కావడంతో, రోడ్ల వెంట భారీ ఎత్తున వాహనాలు నిలిచి, గొడవలకు దారి తీస్తున్న సందర్భంలో చండూర్ సిఐ ఆది రెడ్డి విషయం తెలుసుకొని రంగంలోకి దిగారు. వెంట కానిస్టేబుల్, సిబ్బంది లేకుండానే ఆయన ఒక్కరే ట్రాఫిక్ క్లియర్ చేసారు. గొడవలను సద్దు మనిగేలా చాలా సేపు రోడ్డుపై నిలబడి, వాహనదారులకు సూచనలు చేస్తూ ఇబ్బంది లేకుండా చేశారు. అటుగా వెళ్తున్న క్రైమ్ మిర్రర్ ప్రతినిధి కెమెరాలో వారి చిత్రాలను బంధించారు. తన పరిధి కానప్పటికి గొడవలు తలెట్టకుండా, వాహనదారులు ఇబ్బంది పడకుండా అందరిని నచ్చజేబుతూ, ఆయన చేసిన కాసింత డ్యూటీ చూపరులకు సంతోషాన్ని కలిగించింది. శబాష్ చండూర్ పోలీస్ అంటూ ప్రజలు అనుకున్నారు. నిజానికి సిఐ ఆదిరెడ్డి కల్మషం లేని మనసు గల అధికారి అంటూ ప్రజలు పొగడ్తలతో ముంచెత్తారు.
ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక సమస్య, చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!