
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:– ఏపీ లిక్కర్ స్కామ్లో త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారంటూ కొంత కాలంగా వర్తలు వస్తున్నాయి. ఏపీ మంత్రులు కూడా జగన్ను జైల్లో వేస్తే.. వైసీపీని పూర్తిగా దెబ్బతీసినట్టే అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ను అరెస్ట్ చేస్తే.. మంచి కన్నా.. రాజకీయంగా నష్టపోతామన్న భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని.. కేబినెట్ సమావేశంలో మంత్రులకు చాలా క్లియర్గా చెప్పేశారట చంద్రబాబు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్.. ఒక సంచలనం. ఈ కేసులో వైసీపీ చెందిన నేతలు చాలా మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత.. గత ప్రభుత్వంలో జగన్ చుట్టూ ఉన్న సీఎంవో అధికారులు అరెస్ట్ అయ్యారు.. ఆ తర్వాత మిథున్రెడ్డి.. చివిరికి వైఎస్ జగన్… అరెస్ట్ ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు చేస్తూ.. జగన్ను అరెస్ట్ చేయించే ఆలోచన ఆయనకు లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే… వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత.. ఆయన తనయుడు వైఎస్ జగన్పై అక్రమాస్తుల కేసు పెట్టారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉంచాలి.
అది.. సింపతీగా మారిందని… వైఎస్ జగన్ను సీఎం చేసిందని చంద్రబాబు అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో… తనను జైల్లో పెట్టించారన్న కక్షతోనే ఆనాటి సీఎం జగన్… చంద్రబాబును అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేయించి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారని టీడీపీ అనుకుంటోంది. 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం గడిపారు… ఆ సింపతీ… 2024లో చంద్రబాబుకు ఘనవిజయం తెచ్చిందన్న సెంటిమెంట్ మొదలైంది. ఇప్పుడు… లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే… అది మళ్లీ జగన్ను సింపతీగా మారే అవకాశం ఉందని చంద్రబాబు భయపడుతున్నట్టు సమాచారం. అందుకే.. ఆయన జగన్ అరెస్ట్ విషయం వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో మంత్రులు.. వైఎస్ జగన్ అరెస్ట్ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారట. జగన్ అరెస్ట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. దీంతో.. చంద్రబాబు వారికి ఈ విషయంలో క్లిస్టర్ క్లియర్ జవాబు ఇచ్చినట్టు సమాచారం. కక్ష సాధింపు రాజకీయాలు తమకు వద్దని.. దాని వల్ల ప్రత్యర్థులకే మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. సరైన ఆధారాలు, రుజువులు లేకుండా అరెస్ట్ జరగదని కూడా ఆయన మంత్రులతో చెప్పారట. అయితే.. నేరచరిత్ర కలిగిన వారితో రాజకీయాలు చేయాల్సి రావడం తమ దురదృష్టకరమని మంత్రులు అన్నారట ముఖ్యమంత్రి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ప్రతీకార రాజకీయాలు మాత్రం వద్దని సూచించారట చంద్రబాబు. జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గడానికి మరో కారణం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతకాదన్న… వెనుక నుంచి వైఎస్ జగన్ను ప్రధాని మోడీ సపోర్ట్ ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే.. ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా… కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు… త్రిభాషా వివాదం అంశంలోనూ కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పెట్టిన సమావేశానికి కూడా వైసీపీ హాజరుకాలేదు. అంటే.. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అడుగులు వేయడం లేదు. ఈ క్రమంలో.. జగన్ అరెస్టుకు కేంద్రం నుంచి చంద్రబాబు గ్రీన్సిగ్నల్ వచ్చుండదని.. అందుకే వెనకడుగు వేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది.
గెలిచిన ఆనందం.. ప్రజల్లో మాయం… నిరాశగా ఫ్యాన్స్… లండన్ కు విరుష్క.. అసలు జాలే లేదంటున్న ప్రేక్షకులు!
అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి