తెలంగాణ

ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

చిట్యాల,క్రైమ్ మిర్రర్:- నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ సెంటర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టి యు డబ్ల్యు జె హెచ్-143, టి ఇ యం జె యు చిట్యాల మండల కమిటీ, టి ఇ యం జె యు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు కొల్లోజు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద దేశ యువతకు అందించిన సందేశాలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని కొనియాడారు.

<a href=”https://crimemirror.com/whats-going-on-in-the-cinematography-department/”>సినిమాటోగ్రఫీ శాఖలో ఏం జరుగుతోంది?

యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నాటిన గొప్ప నాయకుడని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్య, సేవ, త్యాగం ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆయన ఆలోచనలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. టి యు డబ్ల్యు జె హెచ్-143, టి ఇ యం జె యు నాయకులు, జర్నలిస్టులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు అన్నారు. కార్యక్రమం శాంతియుతంగా, క్రమబద్ధంగా ముగిసింది.
స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో టి యు డబ్ల్యు జె హెచ్-143, టి ఇ యం జె యు బాధ్యులు మూడ వేణు, చిర్రబోయిన మల్లేష్, వాసా రాంమోహన్, రేగొండి వేణుమాధవ్, బోడిగె విజయ్ కుమార్, మూడ వేంకటాద్రి, గుండ్లపల్లి వెంకన్న, జెల్లా సతీష్, దేశగోని సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా అప్డేట్: జనవరి 26 నుండి భూమి లేని రైతు కూలీలకు కూడా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button