Homeతెలంగాణబిఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

బిఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

చండూరు, క్రైమ్ మిర్రర్: -వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఏఐవిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యత్తపు మధుసూదన్ రావు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చండూరు మండలంలోని గ్రామ శాఖ నాయకులతో ఆయన సమీక్షించి మహాసభకు తరలి వెళ్లేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జెండా ఆవిష్కరణలు చేయాలన్నారు. ఊరూర,వాడవాడల నుంచి మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్ధం అయ్యారు అన్నారు. కెసిఆర్ కాలంలోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రజలు మళ్లీ కెసిఆరే రావాలని కోరుతున్నారు అన్నారు. మహాసభకు తరలివచ్చే ప్రజలు, పార్టీ అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు.

శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సమావేశం..

పాక్ ను రెండు ముక్కలు చేద్దాం.. మోడీకి రేవంత్ పిలుపు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు