గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మాదాపూర్,క్రైమ్ మిర్రర్:- మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానమెట్ ఆర్చ్ వద్ద సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు సుమారు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆమె ఆనియన్ రంగు పూల డిజైన్ ఉన్న చీర,మెరూన్ రంగు జాకెట్, గ్రే రంగు హూడీ ధరించి ఉండగా, రెండు చేతులకు బ్యాంగిల్స్ ఉన్నాయి. పరిశీలనలో ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read also : AIతో భయం అక్కర్లేదు.. విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి

Read also : ఇదంతా దేవుడి రాత.. ఎమోషనల్ అయిన సిరాజ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button