పెద్ద పులి క‌ల‌క‌లం

  • కొబ్బ‌రితోట‌లోకి వెళ్లిన‌ట్లు గుర్తింపు

    సీసీ కెమెరాలో రికార్డ‌యిన పెద్ద‌పులి క‌ద‌లిక‌లు

    భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

 

రాజమండ్రి, క్రైం మిర్ర‌ర్ః

ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ స‌మీపంలో పెద్ద‌పులి సంచారంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ మ‌ధ్య ఉన్న కొబ్బ‌రి తోట‌లోకి పెద్ద‌పులివెళ్లిన‌ట్లు సీసీ కెమెరాలో రికార్డు కావ‌డంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

ఇంత‌కు ముందు ఏలురు జిల్లాను వ‌ణికించిన పెద్ద‌పులి ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన‌ట్లు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1న రాజమండ్రి రూరల్ పరిధిలోని తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపిన ఘటన కూడా కలకలం రేపింది.

కాగా పులి సంచారంతో ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు కంటిమీద కునుకులేకుండా వణికిపోతున్నారు. బ‌య‌టకు వెళ్లి ప‌నులు చేసుకోలేనిప‌రిస్థ‌తి నెల‌కొంది.

అధికారుల అప్ర‌మ‌త్తం…
పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది.

రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బి.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో డీఎఫ్‌వో ప్రభాకరరావు, ఎఫ్‌ఆర్‌వో దావీదురాజు నాయుడు, డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాసరావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పులిని పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారిని రాజమహేంద్రవరం రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button