Wednesday, February 25, 2026
Homeఅంతర్జాతీయంహసీనాను అప్పగించండి, భారత్ ను మరోసారి కోరిన బంగ్లాదేశ్!

హసీనాను అప్పగించండి, భారత్ ను మరోసారి కోరిన బంగ్లాదేశ్!

Sheikh Hasina: భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తిని మనస్సాక్షితో ఆలోచించి పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆదేశ తాత్కాలిక అధినేత యూనస్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

చాలా కాలం పొడిగించడం సరికాదు!

హసీనా అప్పగింత వ్యవహారాన్ని భారత్ చాలా కాలం పొడిగించడం సరికాదన్నారు యూనస్. “హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా, భారత్ స్పందించడం లేదు. ఈ విషయాన్ని ఎక్కువ కాలం పొడిగించడం సరికాదు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ రక్షణ కల్పించకూడదు. దేశ పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయించిన వ్యక్తులను ఏ రాజకీయ వారసత్వం కాపాడలేదు. చట్టబద్ద పాలన, ప్రజాస్వామ్య సమగ్రత విలువను భారత్ గౌరవించాలని కోరుతున్నాం. నాయకులు ఎంత శక్తిమంతమైనా, చట్టానికి అతీతం కాదు. బాధితులను న్యాయం జరగాల్సిందే” అని ఆ లేఖలో యూనస్ కోరారు.

గత ఆగష్టు 5 నుంచి భారత్ లో ఆశ్రయం

బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హసీనా, గత ఏడాది ఆగష్టు 5 బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే తలదాచుకుంటున్నారు. హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత నిరసనకారులు హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏకంగా 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా వేసింది. ఆ తర్వాత యూనస్ తాత్కాలిక దేశాధినేతగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత హసీనాపై హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ ట్రైబ్యునల్‌ ఆమెకు 6 నెలల జైలు శిక్ష వేసింది.  ఈ నేపథ్యంలో ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Read Also: ఉత్తరాదిని వణికించిన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments